KMR: భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెరువులో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రక్షించి ప్రాణాలు కాపాడారు. గ్రామానికి చెందిన పుష్ప కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
తెలంగాణ
'మహిళా ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది'


