హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌పీఆర్‌డీ అధ్యక్షుడిగా పోలే లక్ష్మణ్

NGKL: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కల్వకుర్తి నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా నర్సంపల్లికి చెందిన పోలే లక్ష్మణ్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు ఆయనకు నియామక పత్రం అందజేశారు. నియోజకవర్గంలోని వికలాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని లక్ష్మణ్ తెలిపారు.