NRPT: మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం మక్తల్ మండలంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మక్తల్లోని నల్లజానమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించే బహుజన క్షత్రియ యువ సమ్మేళనానికి హాజరుకానున్నారు. మంథన్గోడ్లో దత్తాత్రేయ ఆలయంలో ఎంపీ నిధులతో నిర్మించిన గదులను ప్రారంభించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ
రేపు మక్తల్కు రానున్న ఎంపీ


