హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి ప్రతిష్ఠాపన మహోత్సవాలు

GDWL: అయిజ మండలం కుట్కనూరు గ్రామంలోని శివాంజనేయ స్వామి ఆలయంలో రేపటి నుంచి ఈ నెల 19 వరకు విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజులపాటు ఆంజనేయ, వినాయక, శివపార్వతి, నందీశ్వర, నవగ్రహ, నాగదేవత, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలు జరగనున్నాయి. ప్రత్యేక పూజలతో పాటు 19న భజన పోటీలు నిర్వహించనున్నారు.