BDK: ఇల్లెందు ఆర్టీసీ డిపో నుంచి మహబూబాబాద్, తొర్రూర్ మీదుగా మియాపూర్కు నూతన బస్సు సర్వీస్లు ఆదివారం ప్రారంభం అయ్యాయి. మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్మిత్ర, డిపో మేనేజర్ సుభాషిణి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సర్వీస్తో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజలు ఈ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
బస్సు సర్వీస్ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్పర్సన్


