హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్నూర్‌లో ఘనంగా వాజ్‌పేయి వర్ధంతి వేడుకలు

ADB: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ 8వ వర్థంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం అందించిందని పేర్కొన్నారు.