SRCL: జిల్లాలో ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి


