విశాఖ యారాడ బీచ్లో మహిళకు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రైల్వే న్యూకాలనీకి చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు సముద్రంలో స్నానానికి దిగారు. అలల ఉధృతికి సూర్యలక్ష్మి (55) నీటిలో కొట్టుకుపోతుండగా బీచ్ లైఫ్గార్డులు కదిరి లావరాజ్, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీను, కదిరి వెంకటేష్ వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఆంధ్రప్రదేశ్
మహిళకు తప్పిన పెను ప్రమాదం


