హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం'

MNCL: అందరికీ ఆదర్శప్రాయుడు భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. వాజ్‌పేయి వర్ధంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.