హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన చైర్మన్‌‌ను సన్మానించిన నాయకులు

SDPT: బెజ్జంకి పీఏసీఎస్ నూతన చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను మండల యువజన నాయకులు బోనగిరి మహేందర్, రవి, విజయ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ను సన్మానించారు. రైతుల సంక్షేమానికి పీఏసీఎస్ ద్వారా మరిన్ని సేవలు అందించాలని కోరారు. రైతులకు అందుబాటులో ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని దామోదర్ తెలిపారు.