JGL: గాంధీనగర్ ప్రాంతంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. టీఆర్ నగర్కు చెందిన కట్ట ప్రశాంత్ (35) తన అత్త నక్క నరసవ్వ (55)పై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. భార్యతో విభేదాలు, విడాకుల వ్యవహారంలో అత్తే కారణమనే కోపంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గాంధీనగర్లో అత్తపై అల్లుడు కత్తితో దాడి


