KRNL: ఆదోని ప్రాంతానికి వస్తున్న తుంగభద్ర జలాలను బళ్లారి రైతులు అడ్డుకోవడం దుర్మార్గమని MHPS నూర్ అహ్మద్ మండిపడ్డారు. తీవ్ర తాగునీటి సమస్య ఉన్న సమయంలో నీటిని అడ్డుకోవడం అమానుషమన్నారు. ఆదోని ప్రజలు, రైతులకు దక్కాల్సిన నీటి వాటా కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేసారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'తుంగభద్ర జలాలను అడ్డుకోవడం దుర్మార్గం'


