హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి

JN: ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు శివారులో జరిగింది. పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన సిద్ధు(20), స్నేహితుడు భవానీశంకర్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధు అక్కడికక్కడేమృతి చెందాడు.