KNR: వీణవంక (M) ఘన్ముక్లలో ట్రాక్టర్కు సంబంధించిన వస్తువులు చోరీ అయ్యాయి. రైతు గాజుల సమయ్య పొలం వద్ద నిలిపిన ట్రాక్టర్ బ్యాటరీ మాయమైంది. మరో రైతు గుడిపాటి శివారెడ్డి ట్రాక్టర్ జాకీ కూడా కనిపించకుండా పోయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన వస్తువుల సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని ఎస్సై ఆవుల తిరుపతి కోరారు.
తెలంగాణ
ట్రాక్టర్ వస్తువుల చోరీ


