హైదరాబాద్: 28°C
క్రీడలు

లార్డ్స్ టెస్టు: టాస్ ఓడిన భారత్

లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న మొట్టమొదటి మహిళా టెస్టు మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన 15 టెస్టుల్లో భారత్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ 11 గెలిచి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.