హైదరాబాద్: 28°C
క్రీడలు

'కండోమ్ యాడ్.. బీసీసీఐ సమాధానం చెప్పాలి'

భారత్-ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం మధ్యలో కండోమ్ ప్రకటనలు చూపించడంపై మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది పిల్లలు, కుటుంబాలు కలిసి చూసే మ్యాచ్‌ల్లో ఇలాంటి అడల్ట్ ప్రకటనలు వేయడం సిగ్గుచేటన్నారు. దీనిపై బీసీసీఐ సమాధానం చెప్పాలని, లేకుంటే ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని ఆయన డిమాండ్ చేశారు.