హైదరాబాద్: 28°C
క్రీడలు

హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా జాఫర్

Advertisement

టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. హైదరాబాద్ జట్టు మెంటార్‌గా అతడిని HCA నియమించింది. రాబోయే రెండేళ్ల పాటు జాఫర్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. దేశవాళీ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వసీం జాఫర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో అతడి సేవలను ఉపయోగించుకోవాలని HCA నిర్ణయించింది.

Advertisement

Advertisement