భోజనం చేస్తూ ఫోన్ స్క్రీన్పై మునిగిపోవడం ఈ రోజుల్లో ఒక అలవాటుగా మారింది. కానీ దీనివల్ల ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో తెలియని 'మైండ్లెస్ ఈటింగ్'కు గురవుతాం. దీంతో మెదడుకు కడుపు నిండిన సంకేతం అందక అతిగా తినేస్తాం. ఇది ఊబకాయం, గ్యాస్, అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. తినేటప్పుడు డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. ఆహారం రుచిని, సువాసనను ఆస్వాదిస్తూ నమిలి తినాలి.
ఆరోగ్యం
ఫోన్ చూస్తూ భోజనం చేస్తున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


