1990లలో భారత్లో మహిళల క్రికెట్కు గుర్తింపు ఉండేది కాదని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. అప్పట్లో తన క్రికెట్ కిట్ బ్యాగ్ చూసి జనాలు హాకీ బ్యాగ్ అని పొరపడేవారని గుర్తుచేసుకుంది. 2007లో బీసీసీఐ పరిధిలోకి వచ్చాకే మహిళల క్రికెట్ రూపురేఖలు మారాయంది. త్వరలో పాక్తో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం హర్మన్ప్రీత్ సేనకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది.
క్రీడలు
మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు


