హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే భారత్, శ్రీలంక మధ్య తొలి పోరు

భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-A జట్ల మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతుండటంతో అందరి కళ్లు అతడిపైనే నెలకొన్నాయి.