హైదరాబాద్: 28°C
క్రీడలు

క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు బృందం

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ప్రీక్వార్టర్స్‌లో భారత్ 3-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మలు తమ సింగిల్స్ మ్యాచ్‌లలో విజయాలు సాధించారు. 65 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో గెలిచిన భారత్ క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌తో తలపడనుంది.