ASR: కొయ్యూరు మండల కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇకపై సచివాలయాల్లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు ఆదివారం తెలిపారు. ప్రతి సోమవారం ఒక సచివాలయాన్ని ఎంపిక చేసి, ప్రజల వినతులు స్వీకరిస్తారన్నారు. ఈనెల 21వ తేదీన కంఠారం సచివాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తామని, మండలాధికారులు, ప్రత్యేక అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కంఠారం సచివాలయంలో పీజీఆర్ఎస్


