హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంటు కోతలపై సబ్‌స్టేషన్ ముట్టడికి హెచ్చరిక

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా తొమ్మిది గంటలంటూ వాస్తవంగా ఏడు గంటలే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని రైతుబంధు మాజీ అధ్యక్షుడు బానప్పగారి నర్సారెడ్డి ఆరోపించారు. విద్యుత్‌ కోతలు ఆపి 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతులతో కలిసి సబ్‌స్టేషన్‌ ఎదుట భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.