NGKL: పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి స్టేజి వద్ద శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. శాఖాపూర్ కనమోని జయన్న (55) బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడని ఎస్సై వి.సతీష్ తెలిపారు. భార్య జయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!


