JN: జాఫర్గఢ్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని బీజేపీ మండల కమిటీ నాయకులు సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోతులు, దోమల బెడద, వీధిదీపాలు, పెండింగ్ బిల్లులతో ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. సమస్యలను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
తెలంగాణ
'సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం'


