హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ చేతిలో ఇండోనేషియా చిత్తు

ఏషియన్ గేమ్స్‌లో భారత హాకీ జట్లు అద్భుత విజయాలతో శుభారంభం చేశాయి. మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌పై 19-0 తేడాతో, పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించాయి. మెన్స్ మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో చెలరేగారు. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు శ్రీలంకతో తలపడనుంది.