హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న సచిన్ సావంత్

HYD: ఖైరతాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక మహాగణపతిని ఏఐసీసీ ఇంఛార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితర ముఖ్య నేతలు కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు, నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు.