హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌ చేపలకు పెరిగిన డిమాండ్‌

KNR: సముద్ర తీరం లేకపోయినా కరీంనగర్‌ మంచినీటి చేపలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. వివిధ నగరాల నుంచి పెద్ద ఎత్తున బుకింగ్‌లు వస్తుండటంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవ్వ, బొచ్చ, జెల్ల వంటి చేపలకు వందల టన్నుల మేర ఆర్డర్లు వస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. గోదావరి, మానేరు నదుల్లో 20 నుంచి 35 కిలోల బరువున్న భారీ చేపలు వలలకు చిక్కుతున్నాయి.