SDPT: బెజ్జంకి మండలం రేగులపల్లి ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా కొనసాగుతున్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించనుంది. కాలనీ వాసుల ఇబ్బందులను గుర్తించిన విద్యుత్ శాఖ 25 కేవీ ట్రాన్స్ఫార్మర్, లైన్ మంజూరు చేసింది. మూడు విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. దీంతో విద్యుత్ సరఫరా మెరుగుపడి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని కాలనీ వాసులు తెలిపారు.
తెలంగాణ
లో ఓల్టేజి సమస్యకు పరిష్కారం


