హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పేదలను వేధించవద్దు'

NRML: ఖానాపూర్‌లో NTR అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా చీఫ్, TDP నేత కొండా జి.సాయి ప్రసాద్ ఈరోజు మాట్లాడుతూ.. మద్యం ఆరుబయట తాగేది పేద, మధ్యతరగతి వారేనని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, జరిమానాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోలీసులు టార్గెట్ లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చి మార్పుతేవాలని, మద్య నిషేధంపై చర్చ జరగాలని, తెలంగాణలో TDP వస్తే పేద, మధ్యతరగతికి బాసటగా నిలుస్తామని అన్నారు.