హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

HNK: వేలేరు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అనంతపురం వెంకటస్వామి చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందారు. రెండు రోజుల క్రితం మల్లేశంతో కలిసి గోపాల్‌పూర్‌ నుంచి వస్తుండగా రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటస్వామి మృతి చెందారు.