హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మంత్రి కోమటిరెడ్డి పర్యటన వివరాలివే!

WNP: మదనాపురం మండలంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆదివారం మదనాపురంలో పర్యటించనున్నారు. రూ.15.25 కోట్లతో నిర్మించిన ఊకచెట్టి వాగు హైలెవల్‌ వంతెనను ప్రారంభించి, అనంతరం మార్కెట్‌ యార్డులో జరిగే సభలో పాల్గొంటారు.మంత్రి పర్యటనకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.