హైదరాబాద్: 28°C
క్రీడలు

అమరావతి ఈ ఛాంపియన్స్‌ శుభారంభం

మహిళల ఆంధ్రా ప్రిమియర్‌ లీగ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌ ఘనంగా బోణీ కొట్టింది. వైజాగ్ ఫైర్‌బర్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట అమరావతి 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ రంగ లక్ష్మి (102) అజేయ శతకంతో చెలరేగగా, దీక్ష (43) రాణించింది. అనంతరం వైజాగ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులే చేయగలిగింది.