ఏలూరు: జిల్లా వైద్య శాఖలో పనిచేస్తున్న వెంకట్ ఆశా వర్కర్ ను లైంగిక వేధించారనే ఆరోపణలపై విచారణ పూర్తయిందని డీఎంహెచ్ఐ శోభ శనివారం తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. 2 రోజుల క్రితమే ఎంక్వైరీ పూర్తయిందని, నివేదికను కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ చైర్పర్సన్కు సమర్పించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా వర్కర్ పై లైంగిక వేధింపులు..!


