NDL: అవుకు(M) ఓబుళాపురంలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని శనివారం సూచించారు. అవుకు రిజర్వాయర్ నుంచి నాలుగు మండలాలకు తాగునీరు అందించేందుకు రూ.57 లక్షల డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పైప్లైన్ పనులను పరిశీలించారు. నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి పైప్లైన్ పనులను పరిశీలించిన మంత్రి


