హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడిలో గాయపడిన టీడీపీ నాయకుడికి పరామర్శ

సత్యసాయి: బత్తలపల్లి మండలం తంబాపురానికి చెందిన టీడీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీశ్‌బాబు పరామర్శించారు. దాడిలో గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఫోన్‌లో ఆదినారాయణరెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఘటనకు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.