హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాస్థాయి క్రీడలకు ముగ్గురు విద్యార్థినులు

WGL: జోనల్‌ స్థాయి క్రీడా పోటీల్లో పర్వతగిరి సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థినులు ప్రతిభ చాటారు. కబడ్డీ, కోకో, వాలీబాల్‌లో 12 మంది పాల్గొనగా అండర్‌-14లో సహస్ర, అండర్‌-17 వాలీబాల్‌లో సీహెచ్‌. నందిని, శ్రీ నిత్య జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శనివారం ఉపాధ్యాయులు, సిబ్బంది వారిని అభినందించి జిల్లా స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.