కృష్ణా: ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం అవనిగడ్డ మండలం పులిగడ్డలోని స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, పనితీరు, ఎన్టీఆర్ భరోసా దరఖాస్తుల నమోదు ప్రక్రియ, త్రాగునీటి సరఫరా అంశాలు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'విధి నిర్వహణలో బాధ్యతగా పని చేయాలి'


