హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూజీసీ-నెట్‌లో పాల్వంచ అధ్యాపకుల అర్హత

BDK: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ అటానమస్‌ కళాశాల అధ్యాపకులు హెచ్‌.శ్రీనివాసరావు (వాణిజ్యశాస్త్రం), భూక్య నరసింహారావు (కంప్యూటర్‌ సైన్స్‌) యూజీసీ-నెట్‌లో అర్హత సాధించారు. అధ్యాపకుల విజయం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.పద్మ తెలిపారు. వారి విజయాలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.