SDPT: హుస్నాబాద్ రోడ్డు వెడల్పు పనుల కారణంగా ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ రోడ్డు హాస్పిటల్, మోడల్ స్కూల్, జీఆర్ రెడ్డి కాలనీ, నేతాజీ నగర్ లైన్లలో సరఫరా బంద్ కానుంది. గణేశ్నగర్, గాంధీ రోడ్డు, అరేపల్లి, పోచమ్మవాడ ప్రాంతాల్లో స్వల్పంగా అంతరాయం కలగనుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


