హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి'

ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్‌ను కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలలో స్వచ్ఛత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు.