హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ మారే ప్రసక్తే లేదు'

PPM: తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు స్పష్టం చేశారు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తాను ఎప్పటికీ విధేయుడిగా ఉంటానన్నారు.