హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరుకు చేరిన కృష్ణా జలాలు

CTR: హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు పుంగనూరుకు చేరాయి. శుక్రవారం నేతిగుట్లపల్లి పంప్‌హౌస్ వద్ద నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. నీరు చేరడంతో తాగునీటి అవసరాలు తీరుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన చెరువులను కృష్ణా జలాలతో నింపాలని రైతులు కోరుతున్నారు. పుంగనూరు మీదుగా పలమనేరు నియోజకవర్గం నుంచి కుప్పం వైపు నీరు తరలించనున్నారు.