అన్నమయ్య: రాయచోటి కోర్టు భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు అందరం కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. రామ్ గోపాల్ సూచించినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పాత కోర్టు స్థల వివరాలు, ఆర్అండ్బీ ప్రతిపాదనలను జిల్లా జడ్జికి అందజేశారు. గత మూడేళ్లుగా అద్దె భవనాల్లో కోర్టులు కొనసాగుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటి కోర్టు భవన నిర్మాణానికి కృషి


