SKLM: పొందూరు మండలం కింతలి జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కంచరాన కీర్తన మండల స్థాయి సెమినార్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినట్లు హెచ్ఎం పైడి సూర్యరావు తెలిపారు. 'ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 ప్రాస్పెక్టస్ అండ్ ఛాలెంజెస్' అంశంపై ఈనెల 21న శ్రీకాకుళంలో నిర్వహించే జిల్లా స్థాయి సెమినార్కు కీర్తన ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా స్థాయి సెమినార్ పోటీలకు ఎంపికైన విద్యార్థి


