హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భార్య, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి'

WGL: మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కట్ల హర్షిత్ (24)చికిత్స పొందుతూ ఈ నెల 17న మృతి చెందాడు. తన కుమారుడి మృతికి భార్య వైష్ణవి, ఆమె తల్లి కలావతి, కానిస్టేబుల్ పోతుల రమేశ్ వేధింపులు, బెదిరింపులే కారణమని మృతుడి తల్లి రాజమణి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6నెలల క్రితం పోలీస్టేషన్‌లో మూడు రోజులు ఉంచి కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.