హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితురాలి తరపున నేనే వచ్చా: ఎమ్మెల్యే

GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా భర్త వేధింపులపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే ఆమెను స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. “ఎవరో వస్తేనే కేసు నమోదు చేస్తామన్నారట.. బాధితురాలి తరఫున నేనే వచ్చా.. కేసు నమోదు చేయండి” అంటూ పోలీసులను ఎమ్మెల్యే కోరారు.