MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కుమారుడు జనంపల్లి హితేష్ రెడ్డి జాతీయ స్థాయి ఈక్వెస్ట్రియన్ పోటీలకు అర్హత సాధించారు. హైదరాబాద్లో జరిగిన క్వాలిఫైయింగ్ పోటీల్లో 64.211 శాతం పాయింట్లతో ప్రతిభ కనబరిచి నేషనల్ ఈవెంట్కు ఎంపికయ్యారు. స్వల్ప వయసులోనే జాతీయ స్థాయికి అర్హత సాధించడంపై కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జాతీయ స్థాయి పోటీలకు హితేష్ రెడ్డి


