హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధన పాటించని హోటల్‌కు నోటీసులు జారీ..!

JN: బచ్చన్నపేట మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వినిల్‌కుమార్ ఆధ్వర్యంలో భారత్ పెట్రోల్ పంపు సమీపంలోని రాజస్థాన్ దాబాలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన మసాలాలు, గ్రేవీలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని స్వీట్ హౌస్‌లకు నోటీసులు జారీ చేశారు.