హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవగాహన కార్యక్రమాలు'

VZM: యువ చైతన్యం త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పూసపాటిరేగ SI అరుణ్ కిరణ్ రెల్లివలసలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీరో డ్రగ్స్‌, మహిళల భద్రత,రోడ్డు భద్రత,స్థానిక సంస్థల ఎన్నికలు,107 BNNS బైండ్‌ ఓవర్‌ బాండ్ల అమలు,బెట్టింగ్‌,సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. యువత ఉద్యోగ నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.